అమీర్పేట్:వయోధికుల హక్కుల పరిరక్షణకు సికింద్రాబాద్ మెయింటనెన్స్ ట్రిబ్యునల్ కోర్టు సభ్యులుగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డి.పార్థసారధి చేస్తున్న కృషి అమూల్యమైనదని ఎస్ఆర్నగర్ వయోధికుల సంఘం అధ్యక్షులు కాసాని సహదేవ్గౌడ్ అన్నారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్పరాలుగా అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం జరుపుకోలేని పరిస్థితుల్లో కౌన్సిల్ తరపున వయోధికుల హక్కుల పరిరక్షణకు తోడ్పాటునందిస్తున్న డి.పార్థసారధిని కౌన్సిల్ ప్రతినిధులు గురువారం ఎస్ఆర్నగర్లోని ఆయన నివాసంలో కలుసుకుని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డి.పార్థసారధి మాట్లాడుతూ నిరాదరణకు గురవుతున్న వయోధికులు తమ హక్కులను సాధించుకునేందుకు వీలుగా ట్రిబ్యునల్ తరపున విశేష కృషి జరుగుతోందన్నారు.