హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదివారం షేక్పేట్లో 9కోట్ల 36 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎంపీ,షేక్పేట్ కార్పొరేటర్ రాషీద్ ఫర్హాజుద్దీన్, నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.