ఖైరతాబాద్, అక్టోబర్ 13 : విద్యాబోధన విధానంలో మార్పు రావాల్సి ఉన్నదని, అప్పుడే జ్ఞాన సముపార్జన జరుగుతుందని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వీకే సింగ్ అన్నారు. ఆన్లైన్ విద్యావిధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన యాక్టివ్ టీచింగ్.. యాక్టివ్ లెర్నింగ్ (ఏటీఏఎల్) తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలువాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటారని, కాని ఆ దిశగా విద్యాబోధన జరుగడం లేదన్నారు. పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యూహాత్మక అభ్యాసం, ఒత్తిడి లేని విద్యా నేర్పించడం లాంటి అంశాలపై పాలక ప్రభుత్వాలు, విద్యాశాఖ దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో డి. శ్రీకాంత్, డాక్టర్ పీకే శర్మ, అశోక్ సింగ్, ఎల్ఎన్ పృష్టి పాల్గొన్నారు.