సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : టీన్యూస్, అపెక్స్ భాగస్వామ్యంతో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్కు విశేష స్పందన రావడంతో పాటు తల్లిదండ్రుల ప్రశంసలు పొందింది. తమ పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేయడం కోసం, ఉన్నత విద్యావకాశాలపై తమకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఏయే ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏయే కోర్సులు ఉన్నయో తెలుసుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు ఎంతో అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఈ మేరకు శనివారం ఈ ఫెయిర్ నిర్వహణ చివరి రోజు కావడంతో ఉదయం 10 నుంచే విద్యార్థులు, తల్లిదండ్రుల తాకిడి పెరిగింది.
ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యా కాలేజీలు, సీట్లు, కోర్సులు, బ్రాంచీలు, ఉపాధి, ఉద్యోగావకాశాలను విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకున్నారు. కాలేజీల వారీగా నిపుణులను అందుబాటులో పెట్టారు. ఇంజినీరింగ్ ఉన్నత విద్యావకాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలు తీర్చారు. అందుకు సందర్శకులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించిన టీన్యూస్, అపెక్స్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్లో కూడా విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాల సమాచారం తెలుసుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ల నిర్వహణ ఎంతో అవసరమని పేరెంట్స్ అన్నారు. ఓ
యూకు చెందిన ప్రొఫెసర్ గడ్డం మల్లేశ్, ప్రొఫెసర్ గోపాల్నాయక్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయగలిగామని.. ఇందులో పాల్గొన్న ఇంజినీరింగ్, ఇతర కాలేజీ యాజమాన్యాలకు టీన్యూస్ సీజీఎం ఉపేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో కాలేజీ యాజమాన్యాలకు గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2021 తరుఫున జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీన్యూస్ సీజీఎం ఉపేందర్, అపెక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్కుమార్ గట్టు, టీన్యూస్ డీజీఏం కిరణ్, మార్కెటింగ్ బృందం సత్యపాల్, శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్ హాజరయ్యారు. స్పాన్సర్లు.. ఫెయిర్ నిర్వహణకు ప్లాటినం స్పాన్స్ర్గా మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థలు, డైమండ్ స్పాన్స్ర్గా సీఎంఆర్ విద్యా సంస్థలు, గోల్డెన్ స్పాన్స్ర్గా మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహరించాయి.