సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : టీన్యూస్, అపెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2021కు అనుహ్య స్పందన లభిస్తున్నది. రెండో రోజు కూడా ఫెయిర్కు భారీ సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వందకు పైగా ఇంజినీరింగ్ స్టాల్స్ను సందర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్పై శుక్రవారం ఫెయిర్ వేదికగా సెమినార్ నిర్వహించారు.ఈ మేరకు సీనియర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందేహాలను నివృత్తి చేశారు.
వెబ్ కౌన్సెలింగ్లో ఎలా పాల్గొనాలి ? గతేడాది ఏ ర్యాంకు వారికి ఎక్కడ సీటు వచ్చింది ? ఈ సారి ఎంసెట్లో ఎంత ర్యాంకు వచ్చిన వారు ఏయే సీట్ల కోసం ఆప్షన్ పెట్టుకోవచ్చు ? ఇప్పుడు ఏ కోర్సులకు బాగా డిమాండ్ ఉంది? కంప్యూటర్ సైన్స్తో పాటు ఇతర మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ చేయడం వల్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయి ? అన్న అంశాలను ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో టీన్యూస్ సీజీఎం ఉపేందర్, అపెక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎండీ దినేశ్కుమార్ గట్టు, టీ న్యూస్ డీజీఎం కిరణ్, మార్కెటింగ్ బృందం సత్యపాల్ శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-21కు ప్లాటినం స్పాన్సర్గా మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థలు, డైమండ్ స్పాన్సర్గా సీఎంఆర్ విద్యాసంస్థలు, గోల్డెన్ స్పాన్సర్గా మల్లారెడ్డి యూనివర్సిటీ ముందుకు వచ్చాయి.