హైదరాబాద్: నగర శివార్లలోని పఠాన్చెరులో ద్రవరూపంలో ఉన్న గంజాయి పట్టుబడింది. పఠాన్చెరు మండలంలోని ముత్తంగి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంగా గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారివద్ద 70 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బోరబండకు చెందిన రాదండి మల్లికార్జున్, షేక్ శంషుద్దీన్, గోరేకర్ శ్రీకాంత్గా గుర్తించారు. వారినుంచి ఒక మోటార్సైకిల్, మూడు సెల్ఫోన్లు, రూ.1700 నగదును స్వాధీనం చేసుకున్నారు.