మళ్లీ వలసకూలీలు కాలిబాట పట్టారు. సొంతూళ్లకు బయలుదేరారు. రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ కాళ్లకి పనిచెప్పారు. పిల్లా పాపాలతో కలిసి హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్నారు.
కాన్పూర్ నేషనల్ హైవేపై వందల్లో కూలీలు కనిపిస్తున్నారు. కాలినడక సొంతూళ్లకు వెళ్తున్నారు. ఓ వైపు పెరుగుతోన్న కరోనా కేసులు ఇంకోవైపు కంటిన్యూ అవుతున్న కర్ఫూ, లాక్ డౌన్ లతో వలసకూలీలు భయాందోళనలకు గురవుతున్నారు. సొంతూళ్లకు వెళ్లడం మంచిదనే ఉద్దేశ్యంతో హైవేలపై బారులు తీరారు. ఆటోలు, ట్రాలీలు ఏది దొరికితే అందులో కొందరు ప్రయాణిస్తున్నారు.