జూబ్లీహిల్స్, : తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానల్లో డిజిటల్ వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈ హెల్త్ కార్డ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జవహర్నగర్ బస్తీ దవాఖానతో పాటు నగరంలోని అబిడ్స్ బొగ్గులకుంట పీహెచ్సీలలో పైలెట్ ప్రాజెక్ట్గా ఈనెల 16 నుంచి డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు.
అన్నిసేవలు ఆన్లైన్లో..
పీహెచ్సీలతో పాటు బస్తీ దవాఖానల్లో నిర్వహిస్తున్న అన్నిరకాల వైద్య పరీక్షలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకుగానూ రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, మందుల సిఫారసు అన్నీ రోగి ఫోన్ నంబర్కు చేరనున్నాయి. బస్తీ దవాఖానల్లో రక్త, మూత్ర, థైరాయిడ్, లివర్, కిడ్నీ, సీబీపీ, కాల్షియం, షుగర్ తదితర అన్నిరకాల ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.
వైద్యసేవల పరిశీలన..
సిటీబ్యూరో : జూబ్లీహిల్స్ నియోజకవర్గం జవహర్నగర్ బస్తీ దవాఖానలో పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టిన డిజిటల్ వైద్య సేవలను సోమవారం కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె.వెంకటితో కలిసి పరిశీలించారు. బస్తీ దవాఖాన జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రుక్మారెడ్డి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ, డాక్టర్ చందన వారి వెంట ఉన్నారు.
మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ
మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణ, ఉచిత ఉపాధి కల్పన ప్రోగ్రాంపై సోమవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం కుట్టు శిక్షణ తీసుకున్న 60 మందికి మిషన్లను అందజేశారు. అంతకుముందు కలెక్టర్ జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. పోషణ పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశిం చారు. ఈ సమావేశాల్లో అధికారులు మహ్మద్ ఖాసిం, పవన్, ఎం. రవిశంకర్, అక్కేశ్వర్రావు, నర్సింహులు, రాములు, పద్మజ, వసంతకుమారి, రోహిణి, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.