సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 353మంది మందు బాబులకు జైలు శిక్ష పడింది. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, కోర్టుల్లో అభియోగాలను నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353మందికి ఒక రోజు నుంచి 20రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేసింది. కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్లో 79, మియాపూర్-60, మాదాపూర్-41, బాలానగర్-49, రాజేంద్రనగర్-30, శంషాబాద్-24, గచ్చిబౌలి-50 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది. వీరందరి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు ఆర్టీఓ అధికారులకు లేఖ రాసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.