బెంగళూరు: కర్ణాటక నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు యువకులను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. దేవనహళ్లి వద్ద వీరిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.
నిందితులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. మార్గమధ్యంలోనే వారిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో హైదరాబాద్కు చెందిన యువకుడితోపాటు విశాఖకు చెందిన ఒక వ్యక్తి ఉన్నట్లు సమాచారం.
మిగతా ఇద్దరు యువకులను బిహార్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరంతా కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరు హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు.