హైదరాబాద్ : హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. జాంబియాకు చెందిన మహిళ ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో రాజీవ్గాంధీ విమానాశ్రయంలో దిగింది. ఆమె డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిలిపి బ్యాగులను తనిఖీ చేసి 3.2 కిలోల నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకియాట్రిక్ సబ్స్టెన్స్ను గుర్తించారు. దీన్ని పరీక్షించిన అధికారులు హెరాయిన్గా నిర్ధారించారు. హెరాయిన్ను సీజ్ చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ 21 కోట్లు ఉంటుందని తెలిపారు. మాదకద్రవ్యాల చట్టం – 1985 కింద నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.