హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ అయినట్లుగా సమాచారం. సర్కారీ వారి పాటా మూవీ సెట్లో అతని వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ కొవిడ్ పాజిటివ్ భారిన పడటంతో మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహేశ్ బాబు సెల్ఫ్ ఐసోలేట్ అయ్యారు. కాగా సూపర్ స్టార్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
మహేష్ హెయిర్ స్టైలిస్ట్తో పాటు, నిర్మాణ బృందంలోని మరో నలుగురు సభ్యులు కూడా కరోనా పాజిటివ్ భారిన పడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఫిలింబీట్ సమాచారం మేరకు కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్లో సర్కారు వారి పాటా మూవీ షూటింగ్ నిలిచిపోయింది. మే 2021లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం.