గోల్నాక, ఆగస్టు 11 : అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇందుకు సంబంధించి కొత్త పైప్లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం గోల్నాక డివిజన్లోని న్యూగంగానగర్లో రూ.10లక్షల 50 వేల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎలాంటి మురుగు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ..డివిజన్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారును ఆదేశిచారు.
కార్యక్రమంలో జలమండలి డీజీఎం సతీష్, ఏఈ రోహిత్, బస్తీవాసులు పూర్ణచందర్రావు, శివ, శంకర్, సతీష్, రాజుగౌడ్, ముత్యాలు, రత్నం, లింగమ్మ, లక్ష్మమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ప్రమోద్, లక్ష్మిబాయి, టీఆర్ఎస్ నాయకులు ఆర్కే బాబు, లింగంగౌడ్, నర్సింగ్యాదవ్, వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Team India: ఇండియన్ టీమ్కు గుడ్బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ