ఎర్రగడ్డ, ఆగస్టు 12 : రహ్మత్నగర్ శాఖా గ్రంథాలయంలో గురువారం డాక్టర్ రంగనాథన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రంగనాథన్ చిత్ర పటానికి లైబ్రరీ ఇంచార్జి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. లైబ్రరీ సైన్స్ పితామహుడిగా పేరు తెచ్చుకున్న రంగనాథన్ గొప్పతనం గురించి పాఠకులకు వివరించారు.
1892లో జన్మించిన ఆయన మద్రాసు యూనివర్సిటీలో ఉన్నత చదువులను అభ్యసించాడన్నారు. లైబ్రేరియన్గా, గణిత మేధావిగా గొప్ప పేరున్న రంగనాథన్ పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారని..సెప్టెంబర్ 27వ తేదీ 1972వ సంవత్సరంలో పరమపదించారని పేర్కొన్నారు.