వీర్నపల్లి, డిసెంబర్ 3: అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామ ని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గర్జనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ గొర్రె కరుణతో కలిసి ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, పేదలు ఆర్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూం అందిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చొరవతో మండలానికి 160 ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. ఆరు నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
జిగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల7న నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రతి ఇంటి నుంచి తరలిరావాలని అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. గర్జనపల్లిలో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని గ్రామాల నుంచి రైతులు, మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. భారీ జన సమీకరణతో సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
గర్జనపల్లికి చెందిన డప్పు కళాకారులకు ఈటీసీఏ అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ రాధారపు సత్యం వితరణ చేసిన డప్పులను టీ(బీ) ఆర్ఎస్ జిల్లా అధ్యడు తోట ఆగయ్య పంపిణీ చేశారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి సమాజసేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ ఎంపీపీ మాలోత్ భూల, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఎడ్ల సాగర్, సర్పంచులు శ్రీనివాస్, రవినాయక్, పార్టీ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేశ్నాయక్, వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ, ఉప సర్పంచ్ దర్శనాల మల్లేశం, నాయకులు మల్లేశం, భాస్కర్, చంద్రం, తిరుపతిరెడ్డి, చిరంజీవి, మల్లేశం, తదితరులు ఉన్నారు.