సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల సొంతింటి కల సాకారం వడివడిగా అమలవుతోంది. నగరంలో వారం రోజులుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ చురుగ్గా జరుగుతోంది. కేవలం ఈ వారం రోజుల్లోనే 754 ఇండ్ల పంపిణీ పూర్తికాగా, గురువారం మరో నాలుగుచోట్ల రూ.35.31 కోట్లతో నిర్మించిన 410 గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సుభాష్ చంద్రబోస్నగర్లో 60, చిలుకలగూడ ధోబీఘాట్లో 207, ముషీరాబాద్ నియోజకవర్గం సాయిచరణ్ కాలనీలో 108, టి.అంజయ్యనగర్లో 35 ‘డబుల్’ ఇండ్ల ప్రారంభోత్సవం జరగనుంది.