కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తాము కోరుకోలేదని, అయితే తమ పార్టీపై దుష్ప్రచారం సాగించారని బెంగాల్ తృణమూల్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సయన్ దేవ్ ఛటర్జీ పేర్కొన్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమ కార్యకర్తలకు ప్రజల తీర్పు ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు.
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విజయోత్సవాలకు దూరంగా ఉండాలని తాము కార్యకర్తలకు సూచిస్తున్నామని ఛటర్జీ చెప్పారు. ఇక మొత్తం 292 స్ధానాలకు గాను పాలక తృణమూల్ కాంగ్రెస్ 209 స్ధానాల్లో బీజేపీ 80 స్ధానాల్లో, వామపక్షాలు రెండు స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇతరులు ఒక స్ధానంలో ముందంజలో ఉన్నారు. మెజార్టీ స్ధానాల్లో తృణమూల్ అభ్యర్ధులు ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో బెంగాల్లో దీదీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమైంది.