రాత్రి కర్ఫ్యూను రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు నిశితంగా గమనిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ షాపులు, పబ్బులు 8 గంటలకు మూసివేసే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్ స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి కర్ఫ్యూ గస్తీలో పాల్గొంటున్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా వారికి అనుమతిస్తున్నారు.