న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. ఆదివారం వేర్వేరు ప్రిక్వార్టర్స్ బౌట్లలో అంకిత్ నార్వల్ (64కి), బిశ్వామిత్రా చోంగ్తమ్ (49కి), సచిన్ (56కి), విశాల్ గుప్తా (91కి), గితిక (48కి) క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యారు. మరోవైపు నిశా గుర్జార్ (64కి) 1-4తో బిట్రైజ్ రోజెన్టెల్ (లాత్వియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.