మహబూబాబాద్, ఏప్రిల్ 30 : 27 వార్డులోని నిరుపేద ముస్ల్లిం కుటుంబాలకు ప్రముఖ వ్యాపారి, మానుకోట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేఎస్ఎన్ రెడ్డి దంపతులు నిత్యావసర సరుకులు అందజేశారు. ము స్ల్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ను పురస్కరించుకుని 27వ వార్డు కౌన్సిలర్ మున్సి పాలిటీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ ఆధ్వర్యంలో 30 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు రఫీక్, సురేశ్, మహ్మద్ గౌస్, యాదగిరి, ప్రభాకర్, వీరేందర్, కార్తీక్, పాష పాల్గొన్నారు.