భారీ వర్షాలు గతేడాది నగరాన్ని అతలాకుతలం చేయడంతో బల్దియా ముందే అప్రమత్తమైంది. ఎంత వర్షం వచ్చినా నగరవాసులకు ముంపు కష్టాలకు రాకుండా సకల జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా నీళ్లు నిల్వకుండా వెంటనే పంపించే ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచింది. గ్రేటర్వ్యాప్తంగా ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే వాలిపోయి సహాయక చర్యలు చేపట్టేందుకు సంచార అత్యవసర (మొబైల్ ఎమర్జెన్సీ) బృందాలను రంగంలోకి దిం చింది. వెయ్యిమంది సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసి, విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.33 కోట్లు కేటాయించింది.
ప్రధానంగా వర్షం కురిసినప్పుడు అత్యధికంగా నీరు నిలిచే ప్రాంతాలు దాదాపు 139 వరకు ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేకంగా 139 స్టాటిక్ లేబర్ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బంది ఉంటారు. వర్షం మొదలుకాగానే ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వెంటనే నీటిని తొలగిస్తారు. వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలు, ఇతరత్రా అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు.
వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా..ధీటుగా ఎదుర్కొనేందుకు బల్దియా సర్వసన్నద్ధమైంది. చినుకుపడినా.. నగరవాసులకు ఏ కష్టమూ రాన్వీకుండా.. మేమున్నామే భరోసా కల్పిస్తున్నది. వర్షాల వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. వాయు వేగంతో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. గ్రేటర్వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది.
వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించేందుకు ఐదు నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో సుమారు వెయ్యి మంది సిబ్బందిని ఇప్పటికే జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంచింది. వీరిని పలు విభాగాలుగా విభజించి… ఏయే సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని చూపాలనే దానిపై శిక్షణ కూడా పూర్తి చేసింది. ఈ సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు జీహెచ్ఎంసీ రూ.33 కోట్లు కేటాయించింది. ప్రధానంగా వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్న 130 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 139 స్టాటిక్ లేబర్ బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బంది ఉంటారు. వర్షం మొదలైన తర్వాత నీరు నిలుస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాల్లోనే వీరు తిష్ట్టవేసి మరీ… సమస్య తలెత్తినప్పుడు ఆ నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతారు.
నగరంలో వర్షంతో పాటు ఈదురు గాలులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షం పడినప్పుడు దిగువకు వరద ప్రవహించే సమయంలో వ్యర్థాలు అడ్డుగా ఉంటున్నాయి. దీంతో నీరు ఎగువకు తన్నుతున్నది. ఫలితంగా ఆవాసాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ కారణంగానే నీరు నిల్వ ప్రాంతాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలను సిద్ధం చేశారు. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున షిఫ్టు విధానంలో విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ టీమ్లు వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలు, ఇతరత్రా అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగిస్తాయి. గాలులకు కూలే చెట్లను కూడా వెంటనే తొలగించి, ట్రాఫిక్ సమస్య రాకుండా చూస్తాయి. అలాగే ప్రత్యేకంగా 67 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. ఒక్కో టీమ్లో నలుగురు చొప్పున షిఫ్టు పద్ధతిలో పని చేస్తూ… వాహనాల్లో తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు.