సుల్తాన్బజార్,ఆగస్టు 20 : అనారోగ్యంతో భాధపడుతూ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ బి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి లక్ష్మీనగర్కు చెందిన మహ్మద్ అమ్జద్ ఖాన్(52) ఐస్ క్రీం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, అనారోగ్యంగా ఉండటంతో తన కుమారుడితో కలిసి దవాఖానలో చూపించుకున్నాడు.
అక్కడ వైద్యులు పరీక్షించిన అనంతరం అడ్మిట్ చేశారు.
అంజద్ ఖాన్ కుమారుడు అమీర్ మందులను తేవడానికి మెడికల్ షాపుకు వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి వార్డులో అంజద్ఖాన్ కనిపించక పోవడంతో కంగారు పడ్డ అమీర్ దవాఖాన పరిసరాలలో ఎంత వెతికినా కనిపించలేదు. అమీర్ అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.