కాచిగూడ,సెప్టెంబర్ 9 : అంబర్పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లోని నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్బజార్ హరిమాజీద్ సమీపంలో రూ.8 లక్షల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన మంచినీటి పైప్లైన్ పనులను గురువారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం బస్తీలో ఎమ్మెల్యే కాలేరు, కార్పొరేటర్ పర్యటించి స్థానిక ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ పలు సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. స్థానిక ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తూ కనీస మౌలిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పలు డివిజన్లల్లో ప్రధానంగా వేదిస్తున్న నీటి కాలుష్య సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఫ్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, కన్నె రమేశ్యాదవ్, సునీల్బిడ్లాన్, బి.కృష్టాగౌడ్, డాక్టర్ శిరీషాయాదవ్, ఓం ప్రకాశ్యాదవ్, డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, ఎర్ర భీష్మ, నాగేందర్బాబ్జీ, బబ్లూ, రవీందర్యాదవ్, బండారు సంతోశ్కుమార్, తుమ్మల నర్సింహరెడ్డి, పట్లూరి సతీశ్, తదితరులు పాల్గొన్నారు.