హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): అది గోదావరిఖనిలోని టీ జంక్షన్. మిట్ట మధ్యాహ్నం. తీవ్రమైన ఎండ. ఓ వృద్ధురాలు చేతిలో కర్ర పట్టుకుని అతి కష్టంపై మెల్లగా నడుస్తూ.. రోడ్డు దాటేందుకు అవస్థపడుతున్నది. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి ఆ వృద్ధురాలిని రోడ్డు దాటించాడు. దవాఖానకు వెళ్లాలని ఆమె చెప్పడంతో ఆటోలో ఎక్కించి.. కిరాయి డబ్బులు సైతం చెల్లించాడు. వృద్ధురాలిని రోడ్డు దాటించిన కానిస్టేబుల్ లింగమూర్తిని డీజీపీ మహేందర్రెడ్డి అభినందించారు. ‘కానిస్టేబుల్ చేతిని నుదుటికి ఉంచుతూ ఆమె చెప్పిన కృతజ్ఞతలో ఎంతో ఆత్మీయ స్పర్శ ఉన్నది’ అంటూ డీజీపీ శనివారం ట్వీట్ చేశారు.