హైదరాబాద్ : భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆషాఢ బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. నగరంలోని గోషామహల్, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని 572 ఆలయాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.2.37 కోట్ల చెక్కులను కమిటీ సభ్యులకు ఇవాళ మంత్రి తలసాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలోని వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. కరోనా దృష్ట్యా భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ఆదర్శం
గోదాం నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి ఎర్రబెల్లి
అర్హులందరికి నూతన రేషన్ కార్డులు : ఎమ్మెల్యే గండ్ర
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు