రాష్ర్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇటీవల గోవా ముఖ్యమంత్రి ద్వారా ప్రైడ్ ఆఫ్ ఇండియా గ్లోబల్ వుమెన్ ఎక్స్లెన్సీ అవార్డును ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రేఖ బోయలపల్లి అందుకున్నారు. మంగళవారం సాయ్రంతం యువ కళావాహిని ఆధ్వర్యంలో అభినందన సత్కారం జరిగింది. కళావాహిని అధ్యక్షుడు వై.కె.నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో అమీర్పేట్లోని సారథి స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
అనంతరం మాట్లాడుతూ టెన్నిస్పై ఆసక్తితో కఠోర శిక్షణ తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించిన రేఖ రాష్ర్టానికి గుర్తింపును తెచ్చారన్నారు. ఉద్యోగ నియామకాల్లో 2శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ మాజీ ఎండీ దినకర్బాబు, ప్రతికా సంపాదకులు మహ్మద్ రఫీ, మదన్గుప్తా, యువ కళావాహిని ప్రతినిధి సంజయ్ ఇందారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.