న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీవీల్లో చర్చలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది. దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆదివారం నాటి ఎలక్షన్ రిజల్స్ట్పై ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యలంలో పార్టీ అధికార ప్రతినిధులెవరూ ఎన్నికల ఫలితాలపై టీవీ చర్చల్లో పాల్గొనబోరని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనాను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఇలాంటి సంక్షోభంలో ఎన్నికల గెలుపు, ఓటమిపై చర్చలకు తమ ప్రతినిధులు దూరంగా ఉండాలని నిర్ణయించారని ఆయన వెల్లడించారు.