జోగులాంబ గద్వాల : కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కర్ణాటక ప్రజలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు రాకుండా సరిహద్దులు మూసి వేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ముసల్ దొడ్డి వద్ద సరిహద్దులను కేటిదొడ్డి పోలీసులు మూసి వేశారు.
ఈ సందర్భంగా పాగుంట సర్పంచ్ సుభాషిణి రెడ్డి మాట్లాడుతూ..లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాగుంట ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అలాగే కర్ణాటక వైపు కూడా వెళ్లరాదని కోరారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్