బంజారాహిల్స్, మార్చి 23: పేదలకు అవసరమయ్యే విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు పరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ గౌరీశంకర్కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నదని అన్నారు. ప్రతి కాలనీకి అభివృద్ధి, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదన్నారు. రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఇతర పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని ప్రజలంతా బలంగా నమ్ముతూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పేదల కోసం జీవో 58, 59 గడువు పెంచారని, త్వరలో గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల చొప్పున సొంతింటి కోసం సాయం అందించనున్నామని అన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరినవారిలో శ్రీనివాస్రెడ్డి, సతీష్గౌడ్, బొర్రా శేషుకుమార్, దుర్గేశ్, గణేశ్ కుమార్, ప్రవీణ్ ముదిరాజ్తో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో మూసాపేట డివిజన్ అవంతినగర్ తోట సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీజేపీ మద్దతుదారుడు మోహన్రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లతో పాటు కాలనీకి చెందిన 100 మంది ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి ప్రతి కాలనీకి చేరిందని.. సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందుతున్నాయన్నారు. అనతికాలంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పాలన సాగుతున్నదని, ప్రజలందరి దీవెనలతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్లో చేరిన నేతలు స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్, సీహెచ్.సత్యనారాయణ, అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, బోడ నర్సింగరావు, అబ్బులు, రాజ్కుమార్, చక్రపాణి తదితరులున్నారు.