జనగామ : జనగామ జిల్లాలోని పెంబర్తి వద్ద నర్సింహా అనే వ్యక్తి తనకు చెందిన భూమిని చదును చేస్తుండగా ఓ లంకెబిందె లభ్యమైంది. దీంతో ఆ రైతు లంకెబిందెను బయటకు తీశాడు. అనంతరం దాన్ని పగులగొట్టి చూడగా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. తక్షణమే ఆ రైతు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆ లంకెబిందెలో భారీగా బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైతు నర్సింహా పొలంలో లంకె బిందె లభ్యమైందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు, అధికారులు లంకెబిందెను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 18 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.