సికింద్రాబాద్, ఆగస్టు 9: అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం పథకాలను రూపొందించిందని తెలిపారు. సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో రూ. 1కోటి 15 లక్షల విలువచేసే 30 మందికి కల్యాణలక్ష్మి, 59 మందికి షాదీముబారక్ చెక్కులను, రూ. 26 లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసే పథకాల కోసం లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తన కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్, మారేడ్పల్లి తహసీల్దార్లు జానకీ, సునీల్కుమార్, కార్పొరేటర్లు, నేతలు కిశోర్ గౌడ్, కిరణ్కుమార్ గౌడ్, రామేశ్వర్గౌడ్, సత్యనారాయణ గౌడ్, మల్లూరి అనీల్, బొగ్గుల కృష్ణ, బాల్రాజ్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.