సికింద్రాబాద్, మార్చి 12 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీ వచ్చేలా టీఆర్ఎస్ నాయకులు కృషిచేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి పట్టభద్రుల నుంచి విశేష స్పందన వస్తున్నదన్నారు. టీఆర్ఎస్ నేతలు, పట్టభద్రులు సమన్వయంతో వ్యవహరించేలా ఏర్పాట్లు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పరిధిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశామన్నారు. ఐదు డివిజన్లలోని 17 పోలింగ్ బూత్ల పరిధిలో ఓటర్లను తాము, పార్టీ నాయకులు వ్యక్తిగతంగా కలిసినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ.. సికింద్రాబాద్లో టీఆర్ఎస్కు మంచి ఆధిక్యత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పరిశీలకులు శ్రీనివాస్, శ్రీకాంత్, యువనేత విజిత్రావు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.
సికింద్రాబాద్, మార్చి 12 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటలాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. బౌద్ధనగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సికిందాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్న విషయం గ్రహించామన్నారు. సరైనా విధానంలో అవగాహన కల్పిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం డివిజన్ ఇన్చార్జి తీగుళ్ల కిరణ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటు వేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూడాలన్నారు. కార్యక్రమంలో నేతలు కందినారాయణ, కార్పొరేటర్ కంది శైలజ, కార్యకర్తలు పాల్గొన్నారు.
సికింద్రాబాద్లోని బౌద్ధనగర్ డివిజన్లో టీఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కుమారుడు కిరణ్కుమార్ గౌడ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. ప్రతి కుటుంబం ఏదో ఒక పథకంతో లబ్ధిపొందిన వారే ఉన్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారన్నారు. ఇలాంటి ప్రయోజనాలు నిరంతరం సాగాలంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా తార్నాక డివిజన్లో పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. డివిజన్లోని మాణికేశ్వరీనగర్, రవీంద్రనగర్, తార్నాక చైతన్య కళాశాల, లాలాపేట, లక్ష్మీనగర్, ఆర్యనగర్, శాంతినగర్, ఓయూలోని ఆరో నెంబర్ క్యాంపు తదితర ప్రాంతాల్లో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులందరూ వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పలు అపార్ట్మెంట్లలో పట్టభద్రులందరినీ పిలిచి, వాణీదేవిని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్థికంగా దివాళా తీసిన భారతదేశాన్ని సంస్కరణలు అమలు చేసి, ప్రపంచంలో ఒక శక్తిగా నిలబెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో దేశానికి ఒక మార్గాన్ని చూపిన మహానుభావుడు పీవీ అని కొనియాడారు. అలాంటి వ్యక్తికి తగిన గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డారు. పీవీ కూతురు వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించి, పీవీకి ఘన నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో ముమ్మరంగా నిర్వహించారు. వర్సిటీ క్యాంపస్లోని పీజీఆర్ఆర్సీడీఈలో ఉద్యోగులు, అధికారులను కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సురభి వాణీదేవి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీఠ వేస్తున్నదని గుర్తుచేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు. సమస్యలను పరిష్కరించే సత్తా, చిత్తశుద్ధి ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్గౌడ్, చాప భాస్కర్యాదవ్, రవి, జంగయ్య, నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.