సికింద్రాబాద్, మే 27: కొవిడ్ టీకాలు తీసుకొనే వారికి సరైన వసతులు కల్పించి ఇబ్బందులు రాకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ వర్గాలు, వ్యాపారులకు కొవిడ్ టీకాలు అందజేయనున్నందున ఆయన గురువారం సాయంత్రం అధికారులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, పౌరసరఫరాల అధికారి బాల మాయదేవి, మెడికల్ ఆఫీసర్ రవీందర్గౌడ్, డీపీఓ బలరామ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
వినాయక్నగర్, మే 27: అల్వాల్ సర్కిల్ సూర్యనగర్లోని వీబీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సూపర్ స్ప్రెడర్స్కు వేయనున్న టీకాల కేంద్రాన్ని జోనల్ కమిషనర్ మమత గురువారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కరోనాను కట్టడి చేసేందుకు ముందుగా సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కొత్త బస్తీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీసీ డాక్టర్ తిప్పర్తి యాదయ్య, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, డీఈ మహేశ్, నిర్వాహకుడు హిమాజ్రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్, మే 27: సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ వేయడం కోసం జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ను ఎంపిక చేశారు. వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారు తప్పకుండా ఆధార్కార్డును వెంట తీసుకురావాలని డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి సూచించారు. కాగా గురువారం సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామలహేమ, పౌరసరఫరాల శాఖ అధికారులు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఏఎస్ఓ బాలరాజ్, రెహమాన్ పాల్గొన్నారు.
మల్కాజిగిరి, మే 27: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పది కౌంటర్ల ద్వారా ఆయా విభాగాలకు చెందిన వారికి వ్యాక్సిన్లు వేయనున్నామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు కవిత తెలిపారు. పదిరోజుల పాటు ప్రతిరోజు వెయ్యిమందికి నిర్ధేశించిన తేదీల్లో టీకాను వేయనున్నామని వివరించారు. శుక్రవారం వేసే వెయ్యిమందికి జీహెచ్ఎంసీ సిబ్బంది గురువారం కూపన్లు పంపిణీ చేశారు.