టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ చొరవతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలకు మోక్షం లభించింది. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఉపసభాపతి కృషితో పరిష్కారమయ్యాయి. ఇందులో తార్నాక డివిజన్లోని లాలాపేట బ్రిడ్జి మరమ్మతు పనులు ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా అపరిషృతంగా ఉన్న ఈ సమస్య వల్ల ఆ దారిగుండా రాకపోకలను సాగించే వాహనదారులు నానా అవస్థలు పడి ప్రమాదాలబారిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అక్కడి ప్రజల సమస్యను గుర్తించిన పద్మారావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.6 కోట్ల వ్యయంతో సంవత్సరంన్నర క్రితం బ్రిడ్జికి మరమ్మతు పనులను చేపట్టి శాశ్వత పరిష్కారం చూపించారు.
లాలాపేట బ్రిడ్జి నుంచి తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ వైపు వెళ్లేవారే కాకుండా ఇసీఐఎల్, మౌలాలి, కుషాయిగూడలతో పాటు తదితర ప్రాంతాలకు రాకపోకలను సాగించే వాహనదారులకు ఈ దారి అనువైంది. నిత్యం ఈ బ్రిడ్జి పై నుంచి వందలాది మంది వాహనదారులు రాకపోకలను సాగిస్తుంటారు. బ్రిడ్జిని నిర్మించి దశాబ్దాలు గడుస్తుండడంతో శిథిలావస్థకు చేరింది. అంతేకాకుండా బ్రిడ్జి దారి నుదుపుగా ఉండడంతో దిచక్రవాహనదారులతో పాటు ఇతర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతుండేవారు. వీటితో పాటు బ్రిడ్జికి పగుళ్లు రావడమే కాకుండా లోడ్ బేరింగ్ వాల్స్ పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఫలితం కనపడలేదు. బిడ్జికి మరమ్మతులు చేపట్టకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వెనువెంటనే రూ.5.80 కోట్ల నిధులను మంజూరు చేయించి మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు బేరింగ్స్ మరమ్మతులను చేపట్టడంతో పాటు పగుళ్లను మూసివేసి, స్లోప్గా ఉండడం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారుల రాకపోకలకు అ నుకూలంగా మార్చారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్కు తార్నాక, లాలాపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే లక్ష్యం. లాలాపేట బ్రిడ్జి మరమ్మతు పనుల విషయంలో నిధులకు వెనుకడుగు వేయకుండా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దశంతో మరమ్మతులను చేపట్టాం. వీటితో పాటు బ్రిడ్జికి ఇరువైపుల ఫుట్పాత్ నిర్మాణ పనులతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాల్సి ఉన్నది. అతి త్వరలో ఆ పనులకు కూడా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – తీగుళ్ల పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్