సికింద్రాబాద్, జూలై 20: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. బస్తీలు, కాలనీల ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త తరలించేవారికి అందజేయాలని కోరారు. సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన శానిటేషన్ వాహనాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో చెత్త నిల్వలు పెరిగిపోవడం వల్ల రోగాలు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పరిశుభ్రతకు ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, హెల్త్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, కార్పొరేటర్లు ప్రసన్న లక్ష్మి, కంది శైలజ, హేమ, కిశోర్ గౌడ్, రామేశ్వర్గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు.