సికింద్రాబాద్, జూన్ 9: కొవిడ్ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కార్మికుల కృషి ప్రశంసనీయమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని 5 డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు బుధవారం సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొవిడ్ను పూర్తిగా నివారించే క్రమంలో చేపడుతున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమ, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, హెల్త్ ఆఫీసర్ రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మెట్టుగూడకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు రమేశ్ ముదిరాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆయన మృతిపట్ల డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. రమేశ్ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.