సికింద్రాబాద్, మార్చి 17: సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీలో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మధురానగర్ కాలనీ సంఘం నాయకులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో కమ్యూనిటీహాల్ త్వరలోనే పూర్తికానుంది. కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు పూర్తయితే పరిసర ప్రాంత ప్రజలకు వరంలా మారనుంది. మధురానగర్ కాలనీలో దాదాపుగా మూడు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలో ఉన్న దాదాపు 5 వందల గజాల స్థలంలో కమ్యూనిటీహాల్ నిర్మిస్తే శుభకార్యాలు జరుపుకోడానికి వీలుంటుందని కాలనీ సంఘం అధ్యక్షుడు గుర్రం పవన్కుమార్ గౌడ్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ను కలిశారు. దీంతో కాలనీలోని ఖాళీ స్థలాన్ని సందర్శించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నుట్లు ప్రకటించారు.
మధురానగర్లో కమ్యునిటీ హాల్ నిర్మాణానికి రూ. 2 కోట్లు కేటాయించారు. 5 వందల గజాల స్థలంలో స్టిల్ట్ ప్లస్ 2 అంతస్తులతో నిర్మించనున్నట్లు అధికారులు తె లిపారు. పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయిస్తున్నారు. మొదటి అంతస్తులో శుభాకార్యాలు చేసుకోడానికి ఏ ర్పాట్లు, వివాహాలు జరిగితే వధూవరులు దుస్తులు మార్చుకోవడం కోసం రెండు గదులు, విద్యుత్ లైట్ల ఏర్పాటు చేస్తున్నారు. కాలనీ వారికి మొ దటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ఇతరులకు అవకాశం కల్పిస్తారు. స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మధురానగర్ కాలనీ అద్భుతం గా ఉంటు ంది. పచ్చని చెట్లు ఆ హ్లాదకరమైన వాతావరం ఉంటు ంది. కమ్యూనిటీహాల్ కావాలని కాలనీవాసులు కోరడంతో నిర్మాణానికి నిధులు మం జూరు చేశా ను. త్వర లోనే నిర్మాణం కూడా పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం – పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్
మధురానగర్ కాలనీలో అడిగిన వెంటనే కమ్యూనిటీహాల్ నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నిధులు మంజూరు చేశారు. పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. కమ్యూనిటీహాల్ నిర్మాణం పూర్తయితే కాలనీ మరింత అద్భుతంగా తయారవుతుంది. రుణపడి ఉంటాం. -పవన్కుమార్ గౌడ్, కాలనీ సంఘం అధ్యక్షుడు