సికింద్రాబాద్, జూన్ 7: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డిప్యూ టీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు మొదలయ్యాయని, ఇబ్బందులు మొదలు కాకముందే రోడ్లు, డ్రైనేజీ పైప్లైన్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయా డివిజన్లలో పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఇప్పటికే నిధులు మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ముఖ్యంగా నాలా పరివాహక ప్రాంతాలలో యుద్ధప్రాతిపదికన పనులు జరపాలన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.