సికింద్రాబాద్, మే 30: కొవిడ్ కట్టడికి వ్యాక్సినే సరైనా ఆయుధమని గుర్తించిన ప్రభుత్వం టీకా లు వేసే ప్రక్రియను చేపట్టిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెంది న సూపర్ స్ప్రెడర్స్కు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఆదివారం జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బండా రు శ్రీనివాస్రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 15వేల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉన్నారని, వారందరికి 10 రోజుల వ్యవధిలో టీకాలు ఉచితంగా వేసే ఏర్పాట్లు జరిపామన్నారు. ఆ తరువాత అవకాశాన్ని బట్టి ప్రజలందరికి టీకాలు వేయిస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, కార్పొరేటర్ హేమ తదితరులు పాల్గొన్నారు.