సికింద్రాబాద్, జూలై 13: సీతాఫల్మండిలోని వెల్ఫేర్ సెంటర్ ప్రాంగణంలో గల ఉప్పలమ్మ దేవాలయంలో మంగళవారం ఆషాఢమాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాల పండుగను జరుపుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేకంగా బోనాలను అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. కార్యక్రమంలో కిశోర్గౌడ్,
కిరణ్కుమార్ గౌడ్, రామేశ్వర్గౌడ్, త్రినేత్ర గౌడ్, కార్పొరేటర్లు కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు.