మన్సూరాబాద్, జూలై 22 : నాలుగు రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నా యి. వరదనీటి చేరికతో నాగోల్ డివిజన్ పరిధి నాగోల్ చెరువు, బండ్లగూడ చెరువు, మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలైన నాగోల్ అయ్యప్ప కాలనీ, శ్రీనివాస కాలనీ, ఆదర్శనగర్, బీకేరెడ్డినగర్, వెంకటరమణకాలనీ, నాగోల్ ఓల్డ్ విలేజ్, మన్సూరాబాద్లోని హకీమాబాద్, ఆగమయ్యకాలనీ, మల్లికార్జున నగర్ నార్త్, గణేశ్ నగర్ కాలనీల్లోని రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో కాలనీలు జలమయంగా మా రాయి. వరదనీటి కారణంగా కొన్ని కాలనీల్లోని రోడ్లు పూర్తిగా ధ్వం సం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి గురువారం నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడ చెరువుతో పాటు లోతట్టు ప్రాంతమైన అయ్యప్పకాలనీలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. వరదనీరు చేరడంతో ఇప్పటికే అయ్యప్పకాలనీకి చెందిన కొందరిని పునరావాస కేంద్రానికి తరలించగా.. మరి కొందరు తమ బంధువుల ఇండ్లకి వెళ్లారు. ప్రస్తుతం అయ్యప్పకాలనీలో కొద్దిగా పరిస్థితులు మెరుగుపడటంతో కాలనీలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైట్ ద్రావనాన్ని పిచికారీ చేయించాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. అయ్యప్పకాలనీలో వరదనీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని.. అదే విధంగా బండ్లగూడ చెరువులోకి చేరుతున్న వరదనీరు దిగువకు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను సూచించారు. అయ్యప్పకాలనీలోని నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఏఎంహెచ్ఓ మంజులవాణి పాల్గొన్నారు.
హయత్నగర్, జూలై 22 : కురుస్తున్న వానలతో డివిజన్ పరిధిలోని ముంపుకాలనీలు జలమయ్యాయి. దీంతో స్పందించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి గురువారం ముంపు కాలనీలను పరిశీలించారు. అనంతరం కాలనీల్లోని నిలిచిన వరదనీటిని తొలగించేందుకు జేసీబీ సహాయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా కాలనీల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సత్వర చర్యలు అందించేందుకు మున్సిపల్ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలిగిన తనను సంప్రదించాలని కోరారు.
హయత్నగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరికుంట, బాతుల చెరువులు నిండి అలుగు పారుతుంది. డివిజన్లోని ఆంధ్రకేసరి నగర్ కాలనీ, పరిసర ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరదనీరు సామ నగర్ మీదుగా కుమ్మరికుంట చేరుకుంటుంది. ఈ చెరువు నిండి బాతుల చెరువులోకి రావడంతో జీ స్కూల్ వద్ద అలుగు పారుతుంది.
ఎల్బీనగర్, జూలై 22 : వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముసురు ఉదయం నుంచి కురుస్తుండటంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండి లోతట్టు ప్రాంతాల వైపు వరదనీరు ప్రవహిస్తోంది. చెరువు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీటి ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వనస్థలిపురం, జూలై 22 : ఎడతెరిపి లేకుండా కుస్తున్న వానలకు శివారు కాలనీలు జలమయమయ్యాయి. బీఎన్రెడ్డి నగర్ డివిజన్లోని కాప్రాయి చెరువు కింది కాలనీలు ముంపునకు గురయ్యాయి. గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, అఖిలాండేశ్వరినగర్, స్నేహమయినగర్, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, అనంతవేణి నగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇంజాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఈ వరద నీరు వస్తోందని, ఆ వరద రాకుండా నివారించాలని స్థానికులు కోరుతున్నారు. స్నేహమయి నగర్ కాలనీ చౌరస్తాలో పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అఖిలాండేశ్వరినగర్, పీవీఆర్ కాలనీలో నీరు ఇళ్లలోకి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చొరవ చూపి నీటిని తొలగించాలని కోరారు.