కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, మే 8: ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న తరు ణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఝాన్సీనగర్ కాలనీ, హనుమాన్నగర్ కాలనీల్లోని పలు ఇండ్లను సందర్శించి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న బృందాల పనితీరును తనిఖీ చేశారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం తదితర రోగాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి అవసరమైన పరీక్షలు చేసి మందులను అందజేయాలని సూచించారు. నివేదికలను పక్కాగా తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా సర్వే నిర్వహించాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్ ఉన్నారు.