నమస్తే తెలంగాణ యంత్రాంగం: సెకండ్ వేవ్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మందులు అందజేసి హోం ఐసొలేషన్లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బోధన్ పట్టణంలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో ఆదివారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 80 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 186 మందికి పరీక్షలు నిర్వహించగా 57 మందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 61 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు వెల్లడించారు.
బోధన్ మండలంలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డాక్టర్ రేఖ తెలిపారు. మండలంలోని సాలూరా చెక్పోస్టు వద్ద 121 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్మూర్ మండలంలో ఆదివారం 68 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 113 మందికి పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ వచ్చిందని సూపరింటెండెంట్ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో 85 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ అయేషా ఫిర్దోస్, సూపర్వైజర్ చంద్రశేఖర్, ఏఎన్ఎం అనురాధ తెలిపారు. దేగాం దవాఖానలో 71 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది పేర్కొన్నారు.
డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 130 మందికి పరీక్షలు నిర్వహించగా, తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసి వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సర్పంచ్ నీరడి సుజన తెలిపారు. ధర్పల్లి పీహెచ్సీలో 98 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల ప్రధాన వైద్యాధికారి రఘువీర్గౌడ్ తెలిపారు. అందులో 26 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 85 మందికి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మోపాల్ మండల పరిధిలో 81 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ నవీన్ తెలిపారు. మోస్రా పీహెచ్సీలో 50 మందికి టెస్టులు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్ వచ్చిందని మెడికల్ ఆపీసర్ స్వప్న తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలని మండల ప్రజలకు ఆమె సూచించారు.
కోటగిరి, పొతంగల్ ప్రభుత్వ దవాఖానల పరిధిలో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సమత తెలిపారు. రుద్రూర్ పీహెచ్సీలో 55 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 11 మందికి పాజిటివ్గా తేలిందని డాక్టర్ దిలీప్ తెలిపారు. వైరస్ను అదుపు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 113 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 37 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. నవీపేట పీహెచ్సీలో 107 మందికి పరీక్షలు నిర్వహించగా.. పది మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి నవ్య తెలిపారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 34 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ సుమంత్ తెలిపారు. చౌట్పల్లి పీహెచ్సీలో 72 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రతన్సింగ్ చెప్పారు. మాక్లూర్ పీహెచ్సీలో 64 మందికి టెస్టులు నిర్వహించగా.. 13 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యుడు సంజీవ్రెడ్డి తెలిపారు. మండలంలోని కల్లడి పీహెచ్సీలో 88 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు సిఖిందర్నాయక్ తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్ తెలిపారు.