సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): డాటా ఎంట్రీకి సం బంధించిన ప్రాజెక్ట్ను ఇప్పిస్తామని ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తు లు మోసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది. తార్నాకకు చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదిక మీదుగా పరిచయమయ్యారు. వారు ఆమెరికాకు చెందిన సంస్థ డాటా ఎంట్రీ ప్రాజెక్ట్ను ఇస్తామని నమ్మించారు. డాటా ఎంట్రీకి సంబంధించిన అంశంలో ఇ క్కడి నుంచి పంపించే షీట్స్కు భారీగా ఫీజు చెల్లిస్తామన్నారు. ఇలా పీ సీ 75 వేల చొప్పున ఇస్తామన్నారు. దీనికి మీరు ఎన్ని పీసీలు ఏర్పా టు చేసుకుంటే అన్నింటికి రూ.40 వేలను అడ్వాన్సుగా చెల్లించాలని వివరించారు. అంతే కాకుండా మీ కార్యాలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఖర్చులను కూడా ఇస్తామని వారు పేర్కొన్నారు. దీంతో మహిళ మొత్తం 20 పీసీలకు గాను రూ.8 లక్షలను చెల్లించింది. ఆ తరువాత వారు స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్టు గ్రహించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.