అంబర్పేట, అక్టోబర్ 16 : అంబర్పేటలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మైదానంలో పెద్ద ఎత్తున దసరా సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇందులో భాగం గా అమ్మవారి ఊరేగింపు, జమ్మిపూజ చేశారు. ఈ సమ్మేళనంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, కార్పొరేటర్లు విజయ్కుమార్గౌడ్, బి.పద్మవెంకటరెడ్డి, దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, అమృత, కన్నె ఉమారాణి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్.గౌత్రంరావు తదితరులతో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు జె.సత్తిబాబుగౌడ్, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీరాములుముదిరాజ్, కార్యదర్శి సి.సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.