గోల్నాక : ప్రతి ఏటా విజమదశిమి రోజున అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దసరా సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం అంబర్పేట మహంకాళీ ఆలయంలో జమ్మి చెట్టు పూజ అనంతరం పల్లకి ఊరేగింపుతో అంబర్పేట మున్సిపల్ మైదానంలో దసరా సమ్మేళనం ప్రారంభమవుతుంది.
భారీ రావణ ప్రతిమ దహనంతో పాటు రాజమండ్రి బృందం ప్రత్యేకంగా తయారు చేసిన బాణసంచా ఆకట్టుకోనుంది. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, మాజీ ఎంపీ వి.హనమంతరావు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొంటారని దేవస్థాన సేవా సమితి ప్రధాన కార్యదర్శి మోర శ్రీరాములు ముదిరాజ్ తెలిపారు.