రవీంద్రభారతి,జూలై 17: ప్రపంచంలోనే అత్యుత్తమ,అరుదైన ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖి అని రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం కొనియాడింది. ఆఫ్ఘన్ భద్రత దళాలు, తాలిబన్ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని కవర్ చేస్తూ పులిక్డర్ బహుమతి గ్రహీత, భారత ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖి హత్యకు గురి కావడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం శనివారం ఎల్బీ స్టేడియం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. డానిష్ సిద్ధ్దిఖి అమర్ రహే, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఫొటో జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎ. గంగాధర్, సీనియర్ ఫోటో జర్నలిస్టు పి. శివకుమార్,హెచ్. సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో రైటర్స్ వార్తా సంస్థకు చీఫ్ ఫొటోగ్రాఫర్గా పనిచేసిన డానిష్ సిద్ధిఖిని కోల్పోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్, సీనియర్ ఫొటోజర్నలిస్టు ఎండీ ఇలియస్, ఉపాధ్యక్షుడు టి. కిషోర్సింగ్, టి. రాంమూర్తి, సంయుక్త కార్యదర్శి వీహెచ్ఎంకె గాంధీ, కోశాధికారి కె. అనిల్కుమార్, నేతలు ఎంఏ సర్వర్, నత్త శ్రీనివాసులు, హరికృష్ణ, ఎ.జాన్,ఎ.మహేశ్, గోపాల్, రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, ధర్మన్న, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.