బంజారాహిల్స్ : ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గేమ్స్ అంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లో నివాసం ఉంటున్న బి.రవి అనే వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తుంటారు. ఇటీవల పిల్లలకు ఆన్లైన్ క్లాసులు జరుగుతుండడంతో తన ఫోన్ ఇచ్చాడు.
వారం రోజుల తర్వాత ఫోన్ను పరిశీలించగా తన గూగుల్ పే అకౌంట్లోనుంచి పలు సందర్బాల్లో రూ.29,739 మాయ మయినట్లు తేలింది. దాంతో ఆరా తీయగా తమకు ఏవో ఆన్లైన్ గేమ్స్ గురించి నోటిఫికేషన్లు వచ్చాయని, వాటిని యాక్సెఫ్ట్ చేశామని పిల్లలు తెలిపారు. దీంతో బ్యాంకును సంప్రదించగా ఆన్లైన్ గేమ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసినట్లు తేలింది. ఈ మేరకు బాధితుడు రవి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.