విషమ పరిస్థితుల్లోనూ సైబరాబాద్ పోలీసులు నగరవాసులకు అండగా నిలుస్తున్నారు. ఓ వైపు శాంతిభద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాక వైరస్ బారిన పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు ప్లాస్మాను సేకరిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు ప్రారంభించిన కొవిడ్ కంట్రోల్ రూం సేవలు దాదాపు 14 వేల మందికి ఉపయోగపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఆపత్కాలంలో పోలీసు శాఖ చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.