తెలంగాణలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల వసతీగృహంలో చదువుకునే గిరిజన విద్యార్థుల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్ఫూర్తిని నింపారు. గురుకుల వసతీగృహంలో చదువుకునే విద్యార్థులు ఇటీవల కాలంలో గోల్ఫ్ క్రీడలో రాణిస్తున్నారు. వారిలో కొందరు సైబరాబాద్ పరిధిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల వసతీగృహంలో 8వ తరగతి చదువుకుంటున్నారు. వీరు ఈ మధ్య జరిగిన మ్యాచ్లో విజయం సాధించి శుభాంకర్ శర్మ ట్రోఫీని గెలుచుకున్నారు. అంతేకాదు వచ్చేవారం కోయంబత్తూర్లో జరగనున్న సౌత్ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులను శనివారం కలిసిన స్టీఫెన్ రవీంద్ర వారికి అభినందనలు తెలిపారు. గెలుపోటములను సమానంగా తీసుకోవడం అలవరచుకోవాలని సూచించారు.
గెలుపోటములను సమానంగా తీసుకోవడం అలవరచుకోవాలని విద్యార్థులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లాలని.. అప్పుడే తెలంగాణకు, దేశానికి గర్వకారణంగా నిలుస్తారని విద్యార్థులను మోటివేట్ చేశారు. ఎప్పుడూ తన సహాయసహకారాలు ఉంటాయని ధైర్యాన్నిచ్చారు.